చివరి టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక.. చాన్నాళ్ల తర్వాత సంజూ శాంసన్ కు అవకాశం

  • పుణేలోని ఎంసీఏ స్టేడియంలో మ్యాచ్
  • సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో భారత్
  • సిరీస్ పై కన్నేసిన టీమిండియా
భారత్, శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ కు పుణేలోని ఎంసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఛేజింగ్ లో దిట్ట అని గ్రహించిన శ్రీలంక ఆతిథ్య జట్టుకు ఆ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. కాగా, మూడు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్ లో టీమిండియా నెగ్గింది. ఈ మ్యాచ్ లో నెగ్గితే సిరీస్ టీమిండియా వశమవుతుంది. ఓడితే సిరీస్ సమం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుదిజట్టులోకి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ను తీసుకుంది. మనీష్ పాండే కూడా తుదిజట్టులోకి వచ్చాడు.
Go Back to Shorts
T20
Pune
Team India
Sri Lanka
Toss

More Telugu News